షిండే సర్కారుపై మమతా సంచలన ఆరోపణలు!

66
cm
- Advertisement -

మహారాష్ట్రలో బీజేపీతో కలిసి తిరుగుబాటు ఎమ్మెల్యేలు షిండే సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షిండే సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని ప్రభుత్వం మరో ఆరు నెలల్లో కుప్పకూలడం ఖాయమని మమతా జోస్యం చెప్పారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈస్ట్-2022 కార్యక్రమంలో పాల్గొన్న మమత …మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొనసాగుతుందని తాను భావించడం లేదన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు.

తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో ఉండడం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు అతడిని రెండుసార్లు ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశ బాధ్యతలను యువత చేపట్టాలని మీకు లేదా? అని నిలదీశారు.

- Advertisement -