షూటింగ్ ప్రారంభించిన బెల్లంకొండ శ్రీనివాస్

210
bellamkonda srinivas
- Advertisement -

అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హీరో చివరగా రాక్షసుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈమూవీ మంచి విజయం సాధించింది. ప్లాప్ లతో సతమతమవుతున్న బెల్లంకొండకు ఈమూవీ కొంత వరకు ఉపశమనాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. కాగా ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. కందిరీగ సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈమూవీ ఫస్ట్ లుక్ నువిడుల చేశారు చిత్రబృందం. ఈమూవీలో శ్రీనివాస్ సరసన నభా నటేశ్, అను ఎమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరకుంది. ఇంకా 10శాతం షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇటివలే ఈమూవీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు చిత్రయూనిట్. లాక్ డౌన్ లేకపోతే ఎప్రిల్ 30న సినిమాను విడుదల చేయాలని భావించారు చిత్రయూనిట్. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు రద్దు కావడంతో మూవీ విడుదల మరింత ఆలస్యం కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు.

- Advertisement -