డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇండస్ట్రీలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తికాగా ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడు మూవీ చేస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్లో భాగంగా ఫేస్ బుక్ ఆఫీస్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
5 సంవత్సరాల సినీ కెరీర్తో పాటు రాక్షసుడు సినమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొనేరు ప్రొడక్షన్ బ్యానర్పై కొనేరు సత్యనారాయణ ఈ మూవీని నిర్మించగా తమిళంలో హిట్ కొట్టిన ‘రాచ్చసన్’మూవీకి ఇది రీమేక్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, నాయికగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. తమిళంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కొడతాడా లేదా వేచిచూడాలి.