శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన చేసింది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని… త్వరలోనే కొలుకుంటారని తెలిపింది. సిడ్నీలోనే కొన్ని రోజులు చికిత్స పొందుతారని వివరించింది.
శ్రేయాస్ అయ్యర్ అక్టోబర్ 25న (శనివారం) సిడ్నీలో జరిగిన మూడవ వన్డేలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు. ఘటన అనంతరం ఆయన మైదానం విడిచి బయటికి వెళ్లి, అనంతరం ఆసుపత్రికి తరలించబడ్డారు.
అయితే, డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు అంతర్గత రక్తస్రావం ప్రారంభమైంది. వెంటనే బీసీసీఐ వైద్య బృందం చర్యలు తీసుకుని ఆయనను ఆసుపత్రిలో చేర్చింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
శ్రేయాస్ నవంబర్ 30న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్లో ఆడనున్నట్లు ముందుగా భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే, ఆయన ఆ సిరీస్లో పాల్గొనే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
Also Read:ఆటో కార్మికులను కాపాడుకుంటాం!

