విమానాశ్రయాల్లో సందర్శకుల అనుమతి నిషేధం

318
airport
- Advertisement -

ఆర్టీకల్ 370రద్దుతో దేశంపై ఎప్పుడైనా దాడులు జరగొచ్చని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు తగ్గట్లుగా తగు చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదులు విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో సందర్శకుల అనుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి దాడులు చేస్తారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సందర్శకుల అనుమతి తప్పకుండా నిషేదించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బందికి ఆంక్షలు విధించారు. ఈ నెల 10 నుంచి 20 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు.

- Advertisement -