రుణం కావాలని వెళితే… కోరిక తీర్చాలన్న అధికారి..

329
Formar
- Advertisement -

పంట రుణం కోసం వెళ్లిన ఓ మహిళా రైతుపై కన్నేశాడు ఓ కామాంధుడు. రుణం కావాలంటే తనకోరిక తీర్చాలంటూ వేధించాడు. కోరిక తీరిస్తే… అదనపు ప్యాకేజీ ఇస్తానంటూ ఆ మహిళా రైతు ఇంటికే రాయబారం పంపాడు బ్యాంక్ మేనేజర్. అతని చేష్టలతో విసిగిపోయిన మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

Maharashtra-Bank-Manager-Se

వివరాల్లోకి వెళ్తే.. బుల్ధానా జిల్లా మల్కాపూర్ మండలంలో నివసిస్తున్న ఓ రైతు దంపతులు… సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో క్రాప్ లోన్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే క్రాప్ లోన్ కోసం వెళ్లిన రైతు భార్యపై కన్నేశాడు బ్యాంక్ మేనేజర్ రాజేశ్ హివాసె. లోన్ పేరుతో ఆమె పూర్తి వివరాలు సేకరించి… తరచూ ఫోన్ చేసి తన కోరిక తీర్చాలంటూ ఆ మహిళను వేధించాడు.

ఈ విషయాన్ని తన భర్తకు చెబితే లోన్ జారీని బ్యాంక్ మేనేజర్ అడ్డుకుంటాడని భావించి ఆమె చెప్పలేదు. ఫోన్ ద్వారా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… రాజేశ్ తన ప్యూన్ ద్వారా ఆ మహిళ ఇంటికి రాయబారం పంపించాడు. తన కోరిక తీరిస్తే లోన్ జారి చేయడమే కాకుండా… అదనంగా ప్యాకేజీ ఇప్పిస్తానని ప్యూన్ తో చెప్పించాడు. మేనేజర్ చేష్టలతో విసిగి పోయిన మహిళ, ప్యూన్ ని చితకబాది, పోలీసులకు అప్పగించింది.

ముందు జాగ్రత్తగా మేనేజర్ తనతో ఫోన్ మాట్లాడిన సంభాషలను రికార్డు చేసి పెట్టిన మహిళ, ఆ రికార్డింగ్స్ ని పోలీసులకు ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో అజ్ఞాతంలో వెళ్లిపోయాడు మేనేజర్ రాజేశ్… కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బ్యాంక్ మేనేజర్ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -