తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల..

50
bandla ganesh
- Advertisement -

ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటులు బండ్ల గణేశ్, రాజేంద్రప్రసాద్,దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించడం విశేషం.

ఇక కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు బండ్ల గణేశ్‌. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా “సేనాపతి” అంటూ ఓటిటిలో, “సూపర్ మచ్చి” సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఉగాది పర్వదిన సందర్భంగా రాఘవేంద్రరావు శ్రీవారిని దర్శించుకున్నారు.

- Advertisement -