ఆకట్టుకుంటున్న ‘పరాక్రమం’ టీజర్

4
- Advertisement -

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ‘పరాక్రమం’ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞానసాగర్ ద్వారక, నిర్మాత ఎస్ కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ – నేను 2004లో జూనియర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చాను. చాలా మంది డైరెక్టర్స్ కు ఆడిషన్స్ ఇచ్చాను. వారికి నా యాక్టింగ్ అర్థం కాలేదు. నువ్వేంటి మాట్లాడినట్లు డైలాగ్స్ చెబుతున్నావ్ అనేవారు. నాకు ఇక్కడ సూట్ కాదని అర్థమైంది. నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే కావాలి అనుకుని దర్శకుడిగా మారాను. చిన్నప్పుడు టీవీలో చిరంజీవి గారిని చూశాకే నాకు సినిమా గురించి తెలిసింది. ఆ తర్వాత ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పీసీ శ్రీరామ్, శ్రీకర్ ప్రసాద్ ఇలాంటి వాళ్లంతా నన్ను ఇన్స్ పైర్ చేశారు. వీళ్లందరినీ స్ఫూర్తిగా తీసుకుని నాలోని సహజమైన ప్రతిభను మెరుగుపర్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్స్ ను పట్టుకోవాలంటే అసాధారణ ప్రతిభావంతుడైన ఉండాలి. ఈ క్రమంలో ఒక 20 ఏళ్ల పాటు రెగ్యులర్ లైఫ్ కు దూరంగా ఉండిపోయా. నేను దర్శకుడిగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా చేశా. అవి మూడూ డిజాస్టర్స్ అయ్యాయి. నేనొక ఫెయిల్యూర్ డైరెక్టర్ నని తెలుసుకున్నా. అప్పుడు నేనే నటించాలని డిసైడ్ అయ్యి నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలు చేశాను. కల నాది వెల మీది కాన్సెప్ట్ లో యూట్యూబ్ లో ఆ సినిమాలను ఉంచాను. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. వాళ్లకు తోచినంత డబ్బులు సపోర్ట్ చేశారు. నేను మెయిన్ స్ట్రీమ్ సినిమా చేయాలని, సకుటుంబంగా ఆ సినిమాలను చూడాలని నా సినిమాలను ఇష్టపడేవారు కోరుకున్నారు. వారందరి సపోర్ట్ తో ఎంకరేజ్ మెంట్ తో పరాక్రమం సినిమా చేశాను. నేను ఇండస్ట్రీలో ఎక్కువగా తిరగను. స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతా కాబట్టి ఎక్కువమందికి నేను నచ్చను. నాకు ఇండస్ట్రీలో నచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎస్ కేఎన్, బుచ్చిబాబు గారు, విశ్వక్ సేన్. ఈ ముగ్గురూ ఇవాళ మా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి గెస్టులుగా రావడం సంతోషంగా ఉంది. ఎస్ కేఎన్ స్ట్రైట్ ఫార్వార్డ్, టాలెంటెడ్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాల్లో టేస్ట్ తెలుస్తుంటుంది. బుచ్చిబాబు గారు ప్రూవ్డ్ డైరెక్టర్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనను ఒకసారి కలిసినప్పుడు మీ మాంగళ్యం సినిమాకు నేను 5 వేలు పంపించాను అన్నారు. థ్యాంక్యూ సో మచ్. విశ్వక్ కూడా నాలాగే స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతాడు. నటుడిగా నన్ను ఎవరితోనూ పోల్చకుండా నన్ను నన్నుగా చూస్తాడు. పరాక్రమం సినిమా కోసం ఒక యజ్ఞం చేశాం. ఇది ఇంపార్టెంట్ టైమ్ నాకు ఇలాంటి టైమ్ లో నాకు సపోర్ట్ గా వచ్చిన విశ్వక్ కు థ్యాంక్స్. నా గత చిత్రాలు కొన్ని సెక్షన్స్ ఆడియెన్స్ కే పరిమితం కానీ ఈ పరాక్రమం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. అందుకే నా బ్యానర్ కు బీఎస్ కే మెయిన్ స్ట్రీమ్ అని పేరు పెట్టాను. అన్నారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ – నేను యానిమేషన్ ఎడిటింగ్ కోర్సులు చేస్తున్నప్పటి నుంచి మా సర్కిల్స్ లో బండి సరోజ్ కుమార్ పేరు వింటున్నా. ఆయన తమిళ్ లో పోర్కాళం అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఆడలేదు గానీ ఆ మూవీని బాగా ఇష్టపడే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉన్నారు. కోవిడ్ టైమ్ లో బండి సరోజ్ కుమార్ నిర్భందం ట్రైలర్ చూసి ఆయనకు మెసేజ్ పంపాను. మీరు ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించాలని అనుకుంటున్నారు. నాకు నచ్చింది అని చెప్పాను. సరోజ్ కుమార్ తనదైన ఒక మూవీ వరల్డ్ ను క్రియేట్ చేసుకున్నారు. కంటిన్యూస్ గా తనదైన తరహా సినిమాలు రూపొందిస్తున్నారు. ఆయనకు పరాక్రమం పెద్ద విజయాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. పరాక్రమం ట్రైలర్ చాలా బాగుంది. సరోజ్ కుమార్ డైరెక్టర్ కంటే నటుడిగా బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు. ఆయన సినిమాకు టీమ్ అంటే ఆయనే. ఒక ఎనిమిది మంది పని బండి సరోజ్ కుమార్ చేస్తుంటాడు. ఆల్ ది బెస్ట్ అన్నా. అన్నారు.

Also read:టీటీడీ దర్శన టికెట్ల అప్‌డేట్

- Advertisement -