- Advertisement -
ఓట్ల చోరీ అరోపణలు అర్థరహితం అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. బ్రేకింగ్ న్యూస్ లు వస్తాయనే నన్ను తిడుతున్నారు అన్నారు. ఓటు చోరీ లేదు, ఏం లేదు…అదే నిజం అయితే కర్ణాటకలో కూడా మేమే అధికారంలోకి వచ్చేవాళ్లం కదా? అని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లోనూ మాకే పూర్తి మెజారిటీ వచ్చేది కదా?… మహేష్ కుమార్ గౌడ్ గురించి కాంగ్రెస్ నేతలే నాకు ఫోన్ లు చేసి చెప్తున్నారు అన్నారు. ఓటు చోరీ జరిగితే కర్ణాటక , హిమాచల్ ప్రదేశ్ , తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వచ్చింది చెప్పాలన్నారు.
బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఎందుకు తక్కువ వస్తాయి… గెలిచిన వెంటనే ఎలక్షన్ కమిషన్ కు ఎందుకు కంప్లైంట్ చేయలేదు చెప్పాలన్నారు బండి.
Also Read:కన్యా కుమారి.. బ్యూటీఫుల్ మూవీ!
- Advertisement -

