బడ్జెట్‌లో నిధులేవి: బీజేపీ నేతలపై బాల్క సుమన్ ఫైర్

167
balka suman
- Advertisement -

బీజేపీ నేతలపై మరోసారి మండిపడ్డారు ఎమ్మెల్యే బాల్క సుమన్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్…కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ర్టానికి ఎన్ని నిధులు కేటాయించారో రాష్ర్ట ప్ర‌జానీకం మొత్తం చూసింద‌న్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, వాటాపై బీజేపీ ఎంపీలు మాట్లాడ‌కుండా, త‌మ సీఎంను, మంత్రుల‌ను పరుష‌ప‌ద‌జాలంతో దూషించ‌డం స‌రికాద‌న్నారు.

బీజేపీ నేత‌ల తీరును రాష్ర్ట ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. నిజామాబాద్‌కు ప‌సుపు బోర్డు తెచ్చిన త‌ర్వాతే ఎంపీ అర్వింద్ మాట్లాడాల‌ని హితవు పలికారు. బీజేపీ ఎంపీల‌కు రాష్ట్రానికి నిధులు తీసుకురావ‌డం చేత‌కాదు.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించ‌డం చేత‌కాదు అని ధ్వ‌జ‌మెత్తారు. ఐటీఐఆర్ ఆపేశామ‌ని పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర‌మంత్రి ప్ర‌క‌ట‌న చేస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ఎంపీలు స్పందించ‌లేదన్నారు.

- Advertisement -