టాలీవుడ్ లో సంచలన కాంబినేషన్ రానుంది. బాలకృష్ణ,ఎన్టీఆర్ లు కలసి తెరను పంచుకోనున్నాడు. అది కూడా తండ్రీకొడుకులుగా. ఈ కాంబినేషన్ కుదిర్చేందుకు నిర్మాత దిల్ రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు దగ్గర పవర్ ఫుల్ తండ్రికొడుకుల కథ ఉందట. ఈ కథలో తండ్రి కొడుకులుగా బాలయ్య ,ఎన్టీఆర్ లు నటిస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదీ కుదరకపోతే.. బాలయ్య , మోక్షజ్ఞ కాంబినేషన్ లో ఈ సినిమాని తీసుకొచ్చేందుకు దిల్ రాజు ప్లాన్ చేశారు.
అయితే, బాలయ్య, ఎన్ టీఆర్ మల్టీస్టారర్ అయితే.. ఓ అద్భుతం అని నందమూరి అభిమానులు అంటున్నారు. వీరిద్దరు కలిసినటిస్తే.. రికార్డులు బ్రేక్ కావడం ఖాయం.ఈ కాంబినేషన్ వర్కవుట్ కావాలంటే బాలయ్య ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఎన్ టీఆర్ సైడ్ నుంచి అభ్యంతరం ఉండకపోవచ్చు. మరీ.. అబ్బాయ్ తో కలసి నటించేందుకు బాబాయ్ ఒప్పుకుంటాడో ?లేదో.. చూడాలి.