బాలాపూర్ లడ్డూ @16.60 లక్షలు

247
balapur laddu
- Advertisement -

ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్‌ లడ్డూ వేలంపాట ముగిసింది. ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. పోటాపోటిగా సాగిన వేలం పాటలో గతేడాది కంటే లక్ష రూపాయలను ఎక్కువగా వెచ్చింది లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు శ్రీనివాస్ గుప్తా. 2016లో కందాడి స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు అమ్ముడైంది. 2017లో   ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 15.60 లక్షల రూపాయల రికార్డు ధరకు విజన్ ఇండియా ఎండీ నాగం తిరుపతి రెడ్డి సొంతం చేసుకున్నారు.

లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గణేశ్‌ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యాక్రమాల కోసం వినియోగిస్తూంటారు. హైదరాబాద్ నగరం అంటే గణేష్ నవరాత్రులకు పెట్టింది పేరు. గణేష్ ఉత్సవాలను నగరవాసులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. నగరంలో ఖైరతాబాద్ గణేషుడికి ఎంత ప్రత్యేకత ఉందో బాలాపూర్ గణేషుడి లడ్డూకి కూడా అంతే ప్రత్యేకత ఉంది. బాలాపూర్ లడ్డూను దక్కించుకోవటానికి రాజకీయ నాయకుల నుండి పారిశ్రామికవేత్తలు ఇలా పలు రంగాలవారు పోటాపడుతుంటారు.

1980లో మొదలై…గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. తొలిసారి 1994లో నిర్వహించిన బాలాపూర్ లడ్డూ వేలంలో రూ. 450 పలికింది.

- Advertisement -