‘అన్ స్టాపబుల్’.. బాలయ్య అదరగొట్టాడు..

119
balakrishna
- Advertisement -

నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అంటూ ఓ టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మ‌న‌సు..’ అంటూ బాల‌కృష్ణ ఓటీటీలోకి వ‌చ్చేశారు. నవంబర్ 4 నుండి ఈ కార్య‌క్ర‌మం ప్రసారం కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోకి వ‌చ్చే తొలి గెస్ట్‌గా మోహ‌న్ బాబు త‌న కుమార్తె మంచు ల‌క్ష్మి, కుమారుడు మంచు విష్ణుతో వ‌చ్చారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరూ ఓ లుక్కేయండి..

- Advertisement -