రామ్ కోసం బాలయ్య వస్తున్నాడోచ్

19
- Advertisement -

రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా వ‌స్తున్న సినిమా స్కంద‌. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 15న వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రిలీజ్ కానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేకర్స్ స్కంద ట్రైల‌ర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్ట్ 26న స్కంద ట్రైల‌ర్‌ను లాంఛ్ చేయ‌డానికి మేక‌ర్స్ ఈవెంట్‌ను ప్లాన్ చేయ‌గా, ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ హాజ‌రు కానున్నాడ‌ని తెలుస్తోంది. ఇక స్కంద ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను శిల్ప క‌ళా వేదిక‌లో నిర్వ‌హించ‌నున్నారు.

హీరో రామ్, బాలయ్యకి అభిమాని, అటు బోయపాటి – బాలయ్య మధ్య కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి రాబోతున్నాడు. ఇప్పటీకే స్కంద‌ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ రైట్స్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కు కూడా భారీగా డిమాండ్ ఉంది. ఇప్పుడు బాలయ్య లాంటి మాస్ హీరో చేయి కూడా పడితే.. ఆ అంచనాలు మరో స్థాయికి వెళ్తాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా శ్రీలీల వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉంది. చేతిలో ఫుల్ సినిమాలున్న శ్రీలీల ఎంబీబీఎస్ చ‌దువుతున్న విష‌యం తెలిసిందే. గ‌తేడాది లాగే ఈ ఏడాది కూడా న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల‌ను పూర్తిగా పరీక్ష‌ల‌కు కేటాయించ‌నుంద‌ట అమ్మ‌డు. ఈ ఏడాదితో శ్రీలీల ఎంబీబీఎస్ కూడా పూర్త‌వ‌నుంది. త‌న అమ్మ కోసం డాక్ట‌ర్ చ‌దువు పూర్తి చేస్తాన‌ని గ‌తంలోనే శ్రీలీల చెప్పింది.

Also Read:ఐర్లాండ్‌తో మూడో టీ20..భారీ మార్పులతో!

- Advertisement -