ఏపీ ప్రభుత్వానికి బాలకృష్ణ విజ్ఞప్తి..!

60
- Advertisement -

పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హామీ ఇచ్చిన మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోందని, వాణిజ్య, పారిశ్రామికంగా ముందంజ వేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంను కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -