మొక్కలు నాటిన హీరోయిన్‌ డింపుల్ హాయతి..

90
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో ఈరోజు సినీ నటి డింపుల్ హాయతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. అనంతరం హీరో రవితేజ,డైరెక్టర్ రమేష్ వర్మ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటి మీనాక్షి చౌదరికి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు డింపుల్ హాయతి.

- Advertisement -