క్రిష్‌ పై బాలయ్య అసహనం ..!

200
Balakrishna angry on Krish.. !
- Advertisement -

సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో తెలుగు సినీ ప్రేక్షకులకు సిసలైన విందు భోజనం వడ్డించారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన శాతకర్ణి బాలయ్య బాబు కెరీర్‌లో రికార్డు వసూళ్లను రాబట్టింది.

తొలిరోజు నుంచే సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తాయి. దర్శకధీరుడు రాజమౌళి దగ్గరి నుంచి ప్రముఖ హీరోల వరకు శాతకర్ణిని ఆకాశానికెత్తేశారు. కేవలం 79 రోజుల్లో ఇలాంటి చారిత్రక కథతో వచ్చిన సినిమాను పూర్తి చేసినందుకు క్రిష్‌కు అందరు అభినందించారు. దర్శకుడు బాలయ్య సైతం క్రిష్‌, మాటల రచయిత సాయిమాధవ్‌ను పలు ఇంటర్వ్యూల్లో వారి ప్రతిభను మెచ్చుకున్నాడు.

అయితే.. తాజాగా క్రిష్‌పై బాలయ్య అసహనం వ్యక్తం చేశాడట. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఇప్పటిదాకా చిత్ర బృందం కలెక్షన్ల వివరాలను మాత్రం బయటపెట్టలేదు. అటువైపేమో.. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 కలెక్షన్లు 100 కోట్ల మార్కును దాటేశాయని.. అల్లు అరవింద్ ప్రకటించేశాడు కూడా. ఇక చిన్న సినిమాగా వచ్చిన దిల్ రాజు శతమానం భవతి సైతం రూ. 30 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే బాలయ్య అసహనానికి కారణమైందట.

చిరంజీవి, శర్వానంద్ సినిమా కలెక్షన్ల వివరాలు బయటకొచ్చినా.. శాతకర్ణి సినిమా కలెక్షన్ల వివరాలను ఎందుకు బయటపెట్టట్లేదని క్రిష్‌ను బాలయ్య ప్రశ్నించాడట. వసూళ్ల లెక్కలను బయటకు చెప్పాలని శాతకర్ణి యూనిట్‌కు బాలయ్య సూచించాడట. అయినా వాటి వివరాలను వెల్లడించకపోవడం బాలయ్యకు ససేమిరా నచ్చలేదట. అందుకే క్రిష్‌పై అసహనాన్ని వ్యక్తం చేశాడట. కాగా, ఇప్పటికే క్రిష్ సహా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర నిర్మాతలపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -