- Advertisement -
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంచేయడం,బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదుసంఖ్య పెంచడం, విద్యాభివృద్ధి పథకాలను సక్రమంగా అమలయ్యేవిధంగా చర్యలు తీసుకోవడం.. ప్రధాన లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ కార్యక్రమం జూన్ 14న ప్రారంభమై 19 వరకు కొనసాగనుంది. ఇది ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. బడిబాటలో రోజువారీగా చేపట్టాల్సిన వాటితోపాటు ‘ప్రారంభానికి ముందు సంసిద్ధత’కు సంబంధించిన మార్గదర్శకాలను శాఖ కమిషనర్ వెల్లడించారు.
- Advertisement -