సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: సుడా చైర్మన్‌

276
Bachu Vijay Kumar
- Advertisement -

ఖమ్మం సుడా మొట్టమొదటి ఛైర్మన్‌గా బచ్చు విజయ్ నియమితులైయ్యారు. సుడా మొట్టమొదటి ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కి ఈ సంద్భంగా బచ్చు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి సుడా చైర్మన్‌గా నియమించిన మంత్రి పువ్వాడ అజయ్ కి కృతజ్ఞతలు అన్నారు.

ఖమ్మం నగరం రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. మంత్రి పువ్వాడ అజయ్ అడుగు జాడల్లో, సీఎం ఆదేశాలతో నగర అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేస్తుంది అన్నారు. ఖమ్మం నగరంతో పాటు సుడాలో విలీనమైన గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈనెల19వ తేదీన సుడా పాలకవర్గం ప్రమాణస్వీకారం వుంటుందని సుడా చైర్మన్ బచ్చు విజయ్ తెలిపారు.

- Advertisement -