మాహిష్మతి రాజ్యంలో రాజెవరు..?

211
- Advertisement -

సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతం మరోసారి బయటపడింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి 2 సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం సంచలనం రెకేత్తిస్తోంది. మొదట్లో ప్రభాస్ , అనుష్క లు ఉన్న సీన్స్ లీక్ కాగా, లేటెస్ట్ గా కొన్ని కీలక సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలిసింది.

పూర్తి స్పష్టతతో ఏదో థియేటరులో చిత్ర ప్రదర్శన జరుగుతున్న వేళ తీసినట్టు తెలుస్తున్న ఈ సీన్ లో, మాహిష్మతి రాజ్యంలో రాజుగా భల్లాలదేవుడు పదవిని చేపట్టే సీన్ ఉందట. అతనికి సైన్యాధికారిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. మాహిష్మతి పురవీధుల్లో వేలాది మంది ప్రజల మధ్య రథంపై భల్లాలదేవుడు వస్తుంటే, కత్తి ధరించి కాపలాగా భాహుబలి ముందు నడుస్తుంటడం, రథంపై వస్తూ భల్లాలదేవుడు కోపంగా దేవసేన (అనుష్క) వైపు చూడటం, ఆపై కట్టప్ప సహా, సైన్యమంతా బాహుబలి ఆదేశాల మేరకు భల్లాలదేవుడికి మోకరిల్లడం కనిపిస్తోంది.

prabhas

భల్లాలదేవుడికి తిలకం దిద్దిన శివగామి, అతనికి కిరీటం పెట్టే దృశ్యాలూ ఉన్నట్టు తెలిసింది.. దీంతో మాహిష్మతి రాజ్యంలో రాజెవరు అన్న ప్రశ్న మొదలైంది.. ఇప్పటికే పలు ప్రశ్నలతో ఎదురు చూస్తున్న సినీ జనాలకు ఇప్పుడు మరో ప్రశ్న ఎదురైంది. అయితే.. పలువురు మాత్రం సెన్సార్ సభ్యులకు షో వేసినప్పుడు తీసిన ఫొటో అయి ఉండొచ్చన్న అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫొటోలు నిజంగా బాహుబలి-2 ప్రీమియర్లకు సంబంధించిందా? లేక లీక్‌ అయ్యాయా? అనే అనుమానం కూడా వ్యక్తమౌతోంది.

baahubali leak

- Advertisement -