రైతులకు ప్రభుత్వం భరోసా: వినోద్ కుమార్

243
B Vinod Kumar
- Advertisement -

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీ పూర్ లోని గాయత్రి పంప్ హౌస్‌ను సందర్శించారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. ఆయనతో పాటు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని తెలిపారు.

రైతుబంధు, రైతుబీమాతో రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నది చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. కాళేశ్వరం ద్వారా చొప్పదండి నియోజకవర్గంలో కరువు పోయిందని బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

- Advertisement -