అవ‌తార్‌-2 దర్శకుడికి కరోనా

68
- Advertisement -

అవ‌తార్‌-2 దర్శకుడు జేమ్స్ కెమ‌రూన్‌కు కొవిడ్ సోకిందనే విషయం తెలిసి ఆయన అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. మరోపక్క అవ‌తార్‌-2 రిలీజ్ కి సన్నద్ధం అయింది. ఈ నేపథ్యంలో అవ‌తార్‌-2 ఫిల్మ్ ప్రీమియ‌ర్‌ ను భారీగా ప్లాన్ చేశారు. అయితే, కోవిడ్ కారణంగా అవ‌తార్‌-2 ప్రీమియ‌ర్‌ కి జేమ్స్ కెమ‌రూన్‌ దూరంగా ఉండనున్నారు. ప్ర‌స్తుతం జేమ్స్ కెమ‌రూన్‌ ఆరోగ్యంగానే ఉన్నార‌ని, రొటీన్ టెస్టింగ్ చేస్తున్న స‌మ‌యంలో జేమ్స్‌కు కొవిడ్ ఉన్నట్టు తేలిందని తెలుస్తోంది.

ఇక లాస్ ఏంజిల్స్ కౌంటీలోని నేచుర‌ల్ హిస్ట‌రీ మ్యూజియంలో జరగనున్న అవ‌తార్‌: ద వే ఆఫ్ వాట‌ర్స్ ఫిల్మ్ ప్రీమియ‌ర్ టాక్ కోసం యావత్తు ప్రపంచ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోపక్క ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

ఇప్పటివరకు ఈ సినిమాకి వచ్చిన బుకింగ్స్‌ ను బట్టి అవతార్ 2 సరికొత్త రికార్డులను రివార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ.పైగా బాక్సాఫీస్ రికార్డులలో కొత్త బెంచ్ మార్క్ సృష్టించటానికి అవతార్ 2 రెడీ అవుతోంది. రిలీజ్ కి ఇంకా మరో రోజు ఉంది. మునుపెన్నడూ ఇలాంటి హడావుడి ఏ సినిమాకి జరగలేదు.

ఇవి కూడా చదవండి…

శ్రీనివాస్ అవసరాల…అవతార్‌2 కు రైటర్

ట్రైలర్…పాన్ ఇండియా లాఠీ

ఆ యంగ్ బ్యూటీకి రొమాన్స్ ఇష్టమట

- Advertisement -