సిద్దిపేటకు ఆటోడ్రైవర్లు బ్రాండ్ అంబాసిడర్లు..

11
- Advertisement -

ఆటో డ్రైవర్లు సిద్దిపేటకు బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట్ పట్టణంలో ‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వరంలో ఆటల పొటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శం అన్నారు.

1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారని,.పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసింది.
ప్రభుత్వం ఆటో డ్రైవర్లు కు నెలకు రూ. 15 వేల జీవన భృతి ఇవ్వాలిని..ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు.

ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరి కడుపు కొట్టాల్సిన అవసరం లేదని,ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అన్నారు.

Also Read:Sharmila:ప్రధానిగా రాహుల్..అదే వైఎస్ కల

- Advertisement -