- Advertisement -
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత శుక్రవారం రంగరాజన్ ఇంటికి వెళ్లింది వీర రాఘవరెడ్డి బృందం. రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నానని తెలిపాడు వీర రాఘవ.
ప్రతి శనివారం చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలన్నారు వీర రాఘవరెడ్డి. అయితే అలా చేయడం కుదరదు అని రంగరాజన్ తేల్చిచెప్పారు. తాను చెప్పినట్లు వినాలంటూ రంగరాజన్ పై వీర రాఘవ దాడికి పాల్పడ్డాడు.
రంగరాజన్ పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. వీర రాఘవరెడ్డిని ఆంధ్రప్రదేశ్, అనపర్తి నియోజకవర్గ వాసిగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు తిరుగుతున్న వీరరాఘవ … తమ సైన్యంలో చేరితే జీతం ఇస్తానంటూ అభ్యర్థిస్తున్నారు.
Also Read:వీకెండ్ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
- Advertisement -