స్వాతంత్ర్య దినోత్సవం..గ్రీన్ ఇండియా ఛాలెంజ్

137
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు అసోసిసేయన్ ఆఫ్ సోషల్ బియాండ్ బౌండరిస్ సంస్థ సభ్యులు. శాపూర్‌లోని జారండిలో 290 మొక్కలు నాటారు.

ఇప్పటివరకు ఈ సంస్థ ప్రతినిధులు 3160 మొక్కలు నాటగా ఈ మొక్కలు గిరిజన కుటుంబాలకు ఉపయోగపడతాయని వెల్లడించారు సంస్థ సభ్యులు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.

- Advertisement -