ఆసియా టెక్ షేర్లుపతనం..కారణమిదే!

3
- Advertisement -

పశ్చిమ ఆసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తమవడంతో సాఫ్ట్‌బ్యాంక్, శామ్‌సంగ్ మరియు ఎస్‌కే హైనిక్స్ వంటి దిగ్గజ ఆసియా టెక్నాలజీ షేర్లు స్వల్ప విరామం తర్వాత మళ్లీ పతనం వైపు పయనించాయి. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేయడంపై అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆసియా మార్కెట్లు తీవ్ర బలహీనతను ఎదుర్కొన్నాయి. ఇరాన్ చేసిన ఈ దుశ్చర్యకు దీటైన సమాధానం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్‌లోని మిలిటరీ ఎయిర్ డిఫెన్స్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు మరియు నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఈ అమెరికా దాడికి ప్రతికారంగా ఇరాన్ …జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై మరియు గల్ఫ్‌లోని మరో 21 లక్ష్యాలపై దాడులు చేసినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో జపాన్ మినహా మిగిలిన దేశాల MSCI ఆసియా-పసిఫిక్ ఇండెక్స్ దాదాపు 3 శాతం పడిపోగా జపాన్ యొక్క ‘నిక్కీ’ (Nikkei) 2 శాతం, కొరియా యొక్క ‘కోస్పి’ (Kospi) 7 శాతం చొప్పున పతనమయ్యాయి.

జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్, కొరియాకు చెందిన శామ్‌సంగ్ మరియు ఎస్‌కే హైనిక్స్ వంటి అగ్రశ్రేణి టెక్ షేర్లు మంగళవారం పుంజుకున్నప్పటికీ ఆ వెంటనే మళ్లీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మెమరీ చిప్ తయారీ సంస్థ ఎస్‌కే హైనిక్స్ 8 శాతానికి పైగా పతనం కాగా, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ 7.45 శాతం క్షీణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ చిప్‌మేకర్ అయిన తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎమ్‌సీ (TSMC) దాదాపు 2 శాతం నష్టపోగా యాపిల్ సరఫరాదారు అయిన హాన్ హై ప్రిసిషన్ ఇండస్ట్రీ (ఫాక్స్‌కాన్) 4 శాతానికి పైగా పడిపోయింది.

Also Read:విమల్ కృష్ణ..’అనుమాన పక్షి’

జూన్ 16-17 తేదీలలో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు, బుధవారం విడుదల కానున్న సీపీఐ (CPI) ద్రవ్యోల్బణ గణాంకాలను మార్కెట్ నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ ఏడాది 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో, ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడరల్ రిజర్వ్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -