ఐపీఎల్‌కు లైన్ క్లియర్..!

176
ganguly
- Advertisement -

ఐపీఎల్ 13వ సీజన్‌కు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లే తెలుస్తోంది. ఈ మేరకు తన బర్త్ డే సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించిన సౌరవ్ గంగూలీ….ఐపీఎల్ లేకుండా ఈఏడాది ముగియదన్నారు.

ఇక పీసీబీ ఆధ్వర్యంలో యూఏఈలో జరగాల్సిన ఆసియా కప్ టీ20 రద్దైనట్లు ప్రకటించారు దాదా. ఆసియా కప్ రద్దు కావడంతో ఐపీఎల్‌ జరిగేందుకు మార్గం సుగుమమైంది.

35 నుండి 40 రోజుల సమయం దొరికితే చాలు ఐపీఎల్‌ని నిర్వహిస్తామని వెల్లడించారు గంగూలీ. అయితే ఈ మెగా లీగ్‌ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నామని తెలిపారు. ఐపీఎల్‌ ఆతిథ్యానికి యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్‌ ముందుకు వచ్చాయి…. కానీ, అదో ప్రత్యామ్నాయమేనని గంగూలీ అన్నాడు.

- Advertisement -