నాగరాజు హత్య క్రూరమైన చర్య: ఓవైసీ

82
owaisi
- Advertisement -

సరూర్‌నగర్‌ పరువు హత్యపై స్పందించారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. నాగరాజును చంపడం క్రూరమైన చర్య అని…హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందని… అది సరైందేనని అన్నారు.

రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా ఇది నేరపూరిత చర్య అని..అయితే సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని… తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని స్పష్టం చేశారు.

కాగా నాగరాజు పరువు హత్యపై గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.

- Advertisement -