స్వీయ నిర్భందంలోకి సీఎం కేజ్రీవాల్..!

211
kejriwal
- Advertisement -

దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు కూడా చేసింది.

అయితే తాజాగా జలుబు, గొంతునొప్పి లక్షణాలతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు సీఎం కేజ్రీవాల్. అత్యవసర సమావేశాలు అన్ని రద్దు చేసుకున్న కేజ్రీవాల్‌కు రేపు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

గత రెండు రోజులుగా ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని సమాచారం. కరోనా నేపథ్యంలో ఆస్పత్రుల్లో వైద్యం అందుతున్న తీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విపత్కర పరిస్థితుల్లో బ్లాక్-మార్కెటింగ్ చేయాలని ప్రయత్నిస్తే మీరు తప్పించుకోలేరని తీవ్రస్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేశారు.

- Advertisement -