బంగారం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చిన జైట్లీ..

295
Arun Jaitley Latest News on gold
- Advertisement -

బంగారం కొనుగోలుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టత నిచ్చారు. లెక్కలు వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే ఇబ్బందిలేదన్నారు. పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో బంగారం కొన్నా ఇబ్బందిలేదన్నారు. ఇంట్లో దాచుకున్న డబ్బుతో బంగారం కొంటే తప్పులేదన్నారు.అంతేకాక వారసత్వంగా వచ్చిన బంగారంపైనా పన్ను ఉండదని తెలిపారు.

బంగారంపై నడుస్తున్న ప్రచారం అవాస్తవమని జైట్లీ వెల్లడించారు. వివాహమైన మహిళ వద్ద అరకేజీ బంగారం ఉంటే ప్రభుత్వం సీజ్ చేయదని… అదేవిధంగా పెళ్లి కాని మహిళ వద్ద 250 గ్రాముల బంగారం ఉన్నా ఎలాంటి స్వాధీనం ఉండదని జైట్లీ స్పష్టం చేశారు. పురుషుల వద్ద కూడా 100 గ్రాముల బంగారం ఉండొచ్చని, దీనిపై కూడా ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పదని చెప్పారు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లకుబేరులు ఇబ్బడిమొబ్బడిగా బంగారం కొనుగోళ్లు చేపట్టిన సంగతి తెలిసిందే. నల్లకుబేరులు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా చేపడుతున్నారని, వారికి ఆభరణ దుకాణదారులు సహకరిస్తున్నారని తెలుసుకున్న కేంద్రం వారికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కొనుగోలుదారులు వద్ద పాన్ కార్డు తీసుకోకుండా ఎలాంటి బంగారం విక్రయాలు చేపట్టవద్దని హెచ్చరించింది. అంతేకాక పలు ప్రాంతాల్లోని బంగారం దుకాణాల్లో ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ కూడా నిర్వహించింది.

- Advertisement -