సిట్ విచారణకు హాజరైన చిన్నా

197
Art Director Chinna at SIT office
- Advertisement -

డ్రగ్స్‌ మాఫియా కేసులో ఆరో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా సిట్‌ విచారణకు హాజరయ్యారు. మీడియా కంట పడకుండా మూడు వాహనాలు మారి సిట్‌ కార్యాలయానికి చిన్నా చేరుకున్నారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద 22 చిత్రాలకు పని చేశారు. విచారణ ఎదుర్కొంటున్న వారు చెబుతున్న అంశాల ఆధారంగా సిట్‌ అధికారులు క్రాస్‌ చెక్‌ చేస్తున్నారు. వారు చెప్పే అంశాలకు బలం చేకూర్చేలా ఆధారాలూ సేకరించినట్లు సమాచారం. వాటి ఆధారంగా మరో నలుగురు సినీ ప్రముఖులకు నేడో రేపో నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఇదిఇలా ఉండగా చిన్నా కోసం ప్రత్యేక ప్రశావళిని అధికారులు రూపొందించనట్లు తెలుస్తోంది. పూరితో పరిచయం..?డ్రగ్స్ అలవాటు ఉందా…?ఎవరితో కలిసి డ్రగ్స్ తీసుకునే వారు..?పూరితో కలిసి బ్యాంకాక్‌ వెళ్లారా..? వంటి ప్రశ్నలతో పాటు కెల్విన్‌తో పరిచయం..?ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకుంటున్న వారేవరు..?వంటి ప్రశ్నలతో పాటు మరింత సమాచారాన్ని రాబట్టనున్నారు.

ఇప్పటికే ఈ కేసులో నోటీసులు జారీ చేసిన 12మందిలో అయిదుగురు ( పూరీ జగన్నాథ్‌, శ్యామ్‌ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌)ను సిట్‌ అధికారులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఇవాళ చిన్నా హాజరు కాగా, మరో ఆరుగురిని ప్రశ్నించాల్సి ఉంది.

- Advertisement -