పాక్ వక్రబుద్ది…ఇదిగో సాక్ష్యం

499
pak
- Advertisement -

పాక్‌ దొంగబుద్ది మరోసారి బయటపడింది.కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయంగా మద్దతు లభించక పోవడంతో దాడులే లక్ష్యంగా కెరాన్‌ సెక్టార్‌ ద్వారా భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్ కమాండోలు ప్రయత్నిస్తున్న వీడియోని విడుదల చేసింది భారత సైన్యం. పాకిస్థాన్‌ జెండాతో ఐదుగురు కమాండోలు ప్రవేశిస్తున్నట్టుగా ఈ వీడియోలో రికార్డయింది.

మరోవైపు ఉగ్రవాదులు నదిమార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించారని ముఖ్యంగా సౌత్‌లో దాడులు జరిగే అవకాశం ఉందని ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు.

ఉగ్రవాదులు కేరళలో ఉన్నట్లుగా ఐబీ వర్గాలకు సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆర్మీ అధికారులు అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతంలో ప్రత్యేకమైన భద్రతలు తీసుకోవాలని సూచించారు. జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ వంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆర్మీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -