జయలలిత మృతిలో శశికళపై అనుమానం:ఆర్ముగస్వామి నివేదిక

134
- Advertisement -

తమిళనాడు మాజీ సీఎం జయలలిత 2016లో అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఎడప్పాడి పళని స్వామి జయలలిత మరణంపై అనుమానాలను నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా ఆర్ముగస్వామి తన నివేదికను స్టాలిన్‌ ప్రభుత్వానికి అందజేశారు. అయితే తమిళనాట ప్రస్తుతం ఆర్ముగస్వామి కమిషన్‌ నివేదికపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నివేదికలోని పలు కీలక అంశాలు బయటపడ్డాయి.

అనారోగ్య సమస్యలతోనే జయలలిత మరణించినా.. ఆమె మరణించిన సమయం, అందిన వైద్య చికిత్సలపై కమిషన్ సందేహాలు వ్యక్తం చేసింది. జయలలిత నెచ్చెలి శశికళను విచారిస్తే ఈ వ్యవహారంలో అసలు విషయాలు తెలుస్తాయంటూ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. జయలలిత 2016 డిసెబర్ 5న చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నా.. తాము విచారించిన సాక్షుల మాటల ప్రకారం ఆమె 2016 డిసెంబర్ 4వ తేదీనే మరణించారని కమిషన్ తెలిపింది.

జయలలిత మరణంపై శశికళతో పాటు ఆమె బంధువు అయిన డాక్టర్ , జయకు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ శివకుమార్, అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శిలపై విచారణ జరిపితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. జయలలిత మరణంపై నెలకొన్న అనుమానాలు వీడాలంటే శశికళతో పాటు అందరినీ విచారించాల్సిందేనని కూడా కమిషన్ తన నివేదకలో తెలిపింది.

జయలలిత మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ముఖ్య అనుచరుడు, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించారు. గతేడాది ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జయలలిత మరణంపై నెలకొన్న అనుమానాలను వెలుగులోకి తీసుకొస్తామని డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ కూడా ప్రకటించారు.

- Advertisement -