అరుదైన రికార్డు సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ..

216
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రానికి తొలి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం, రెస్పాన్స్ అదిరిపోయే విధంగా ఉండటంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని ఏరియాలో ఈ చిత్రం బాహుబలి రికార్డులను సైతం అధిగమించడం ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్చ పరుస్తోంది.

తాజాగా సమాచారం ప్రకారం.. బుధవారం నాటి ప్రిమియర్ల తోనే $797366 సాధించిన ఎన్టీఆర్ సినిమా గురువారం నాడు $242424 సాధించి వన్ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. ఇక శుక్రవారం నాడు $276477 కలెక్షన్స్ సాధించింది. శనివారం మధ్యాహ్నానికి $198294 కలెక్షన్స్‌తో టోటల్ ఒకటిన్నర మిలియన్ డాలర్లకు చేరింది. కరెక్ట్‌గా చెప్పుకుంటే సాటర్ డే అఫ్టర్ నూన్ వరకూ టోటల్ $1514561.

Aravinda Sametha

అయితే ఇంతవరకు మరే తెలుగు హీరోకూ సాధ్యంకాని ఓ రికార్డును ఎన్టీఆర్ ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు. ఓవర్‌ సీస్‌ లో భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా, ఇప్పటికే సుమారు 1.7 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ. 12.50 కోట్లు) వసూలు చేసింది. ఈ స్థాయిలో ఓవర్ సీస్ వసూళ్లు సాధించిన హీరోల్లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ఉన్నప్పటికీ, వీరెవరూ తమ వరుస నాలుగు చిత్రాల్లో ఇంత కలెక్షన్లు సాధించలేదు.

ఆ రికార్డు యంగ్ టైగర్ కే సొంతమైంది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’ చిత్రాలు 1.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా, ఇప్పుడు ఆ జాబితాలోకి ‘అరవింద సమేత’ కూడా చేరిపోయింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం విశేషం.

- Advertisement -