నూతన సచివాలయం ముహుర్తం ఖరారు..

53
- Advertisement -

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ మేరకు నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు సీఎం కేసీఆర్. అలాగే బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు అంటే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 2న అమరవీరుల చిహ్నం ఆవిష్కరణ జరుగనుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ. 617 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్ని అద్భుతంగా చేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది.

వాస్తవానికి ఫిబ్రవరి 17న నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -