- Advertisement -
ఏపీ SSC (టెన్త్) వాల్యుయేషన్లో లోపాలు జరగడంతో 5 మంది వాల్యుయేటర్లను సస్పెండ్ చేసింది పాఠశాల విద్యాశాఖ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైపాల్యంవల్లే అంటూ మండిపడుతున్నారు ప్రతిపక్షనేతలు.
టెన్త్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 66,363 రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు వచ్చాయి. 11,175 స్క్రిప్టుల మార్కులలో లోపాలు గుర్తించగా మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా లోపాలు నివారించకపోవడంపై విద్యాశాఖ సీరియస్ అయింది.
జూన్ మొదటివారంలో RV, RC ఫలితాల పూర్తి చేయగా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. జూన్ 5 నుంచి 10 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.
Also Read:మిస్ వరల్డ్ కార్యక్రమాల వివరాలు..
- Advertisement -

