ఏపీలో కొత్తగా 332 కరోనా కేసులు నమోదు..

92
- Advertisement -

ఏపీలో గత 24 గంటల వ్యవధిలో 29,243 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 332 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 585 మంది కోలుకోగా, ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,302కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,040 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 20,39,545 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,193 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 55 కొత్త కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో 43, గుంటూరు జిల్లాలో 42 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం, కర్నూలు జిల్లాలలో 3 కేసుల చొప్పున గుర్తించారు.

- Advertisement -