ఏపీలో కరోనా తగ్గుముఖం..

71
- Advertisement -

ఏపీలో గడచిన 24 గంటల్లో 25,532 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,670 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,48,151 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,142 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,377కి పెరిగింది.

తాజాగా నమోదైన కేసులలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 51 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 33 కేసులు గుర్తించారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 429 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు.

- Advertisement -