మడత పెట్టేదెవరు.. జగనా ? చంద్రబాబా ?

39
- Advertisement -

ఏపీలో ఒకరు షర్టు మడత పెట్టేందుకు సిద్దమా ? అంటుంటే.. మరొకరు కుర్చీ మడత పెట్టేందుకు సంసిద్దం అంటూ రెడీ అయ్యారు.. ఇలా అధికార ప్రతిపక్ష నేతల మద్య జరుగుతున్న మాటల యుద్ధం ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్.. వంటి పార్టీలు ప్రచారాలను మొదలు పెట్టాయి. ప్రచారంలో భాగంగా అధినేతలు నువ్వా నేనా అన్నట్లు కామెంట్స్ చేయడంతో పాటు ప్రజాకర్షణ కోసం భారీగా హామీలు ప్రకటిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో నిన్న మొన్నటి వరకు టీడీపీ మంచి దూకుడు కనబరిచింది. ఇక సిద్ధం కార్యక్రమంతో వైసీపీ కూడా ప్రచారానికి తెర తీసింది.

తాజాగా రాప్తాడు లో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ” షార్ట్ స్లివ్స్ మడత పెట్టాల్సిన టైమ్ వచ్చిందని, టీడీపీని మరోసారి మడత పెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని ” జగన్ తనదైన రీతిలో వ్యాఖ్యానించారు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని గమనిస్తే పంచు డైలాగుల డోస్ కాస్త ఎక్కువగానే పెంచినట్లు చాలమంది చెబుతున్న మాట. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధం అని తనదైన రీతిలో వ్యాఖ్యానిస్తూనే ‘ టీడీపీని మరోసారి మడతపెట్టడం గ్యారెంటీ అంటూ పంచులు కురిపించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పంచు డైలాగుల దోస్త్ కాస్త గట్టిగానే పెంచినట్లు తెలుస్తోంది.

“తన రాజకీయాల ముందు నువ్వొక పిల్లబచ్చావని, తన రాజకీయం దెబ్బకు మీ నాన్నే భయపడేవారని ” జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల పంచులు కురిపించారు. అంతే కాకుండా ఈసారి జగన్ స్లివ్స్ మడత పెట్టడం కాదు.. జనాలు కుర్చీ మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారని ” మూవీ డైలాగ్స్ రీతిలో పోలిటికల్ పంచులు విసిరారు చంద్రబాబు.. ఇలా ప్రధాన పార్టీల అధినేతలు.. మూవీ డైలాగ్స్ ను తలపించేలా ఒకరిపై ఒకరు పంచులు విసురుకోవడంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరి కూర్చిని మడతపెట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారో చూడాలి.

Also Read:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎంపీ అరవింద్ చురకలు

- Advertisement -