లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఏపీ మంత్రి రోజా…

24
roja
- Advertisement -

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు ఏపీ మంత్రి రోజా. స్వాతి నక్షత్రం సందర్భంగా శతఘటాభిషేకంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అర్చకులు మంత్రి రోజాకు వేదాశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా… శ్రావణమాసంలో స్వాతి నక్షత్రం రోజు స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని, అది కేసీఆర్ పూర్వ జన్మసుకృతమన్నారు. భగవంతుడు తనకు నచ్చిన వారితో ఆలయ నిర్మాణం చేస్తాడని.. సీఎం కేసీఆర్‌కు ఆ భాగ్యం దక్కిందని వెల్లడించారు.

ప్రజలకు సేవచేయడానికి యాదాద్రీశుడు తనకు మరింత ధైర్యం, రెట్టింపు ఉత్సాహం ఇస్తాడని చెప్పారు. గతంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మంత్రి అయ్యానని గుర్తుచేశారు.

- Advertisement -