- Advertisement -
ఇంటర్మీడియట్ సిలబస్లోనూ మార్పులు చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనుండగా 20 ఇంటర్నల్ పరీక్షల మార్కులు, 80 ఎక్స్ టర్నల్ మార్కులు ఉండనున్నాయి.
12 ఏళ్ల తర్వాత సైన్స్ కోర్సు సిలబస్లో మార్పు చేసింది ఇంటర్ బోర్డు. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్లో మార్పులు చేయగా హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్ తెస్తోంది ఇంటర్ బోర్డు.అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్లతో ఏసీఈ కోర్సు తెచ్చింది ఇంటర్ బోర్డు.
ఇక మరోవైపు తెలంగాణలో ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చ్ 18 వరకు పరీక్షలు జరగనుండగా ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది ఇంటర్ బోర్డు.
Also Read:ఫలించిన హరీశ్ రావు కృషి
- Advertisement -

