నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టం:హోం మంత్రి

101
- Advertisement -

నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టమని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నేరం జరగటంలేదని మేం చెప్పటం లేదు.. నేరం జరిగితే, ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి తెలిపారు. పార్టీ ఏదైనా.. మహిళలపై చెయ్యేస్తే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశాం.. విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌గా పోటీ చేసిన వినోద్ జైన్ పైనా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. లోకేష్ పీఏ మహిళల్ని వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ప్రతి మహిళా దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి, పోలీసు రక్షణ పొందాలి.

- Advertisement -