నేడు ఏపీలోభారీగా క‌రోనా కేసులు

206
coronavirus
- Advertisement -

దేశ వ్యాప్తంగా రోజురోజుకి క‌రోనా వైర‌స్ విభృంభిస్తోంది. లాక్ డౌన్ అనంత‌రం దేశ వ్యాప్తంగా భారీ సంఖ్య‌‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా అదే స్ధాయిలో కేసులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం క‌రోనాకు సంబంధించి హెల్త్ ‌బులిటెన్ ను విడుద‌ల చేసింది. నేడు ఏపీలో కొత్త‌గా 465 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

ఈ రోజు న‌లుగురు మృతి చెందిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,961కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 376 మంది రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 70 మందితో పాటు విదేశాల నుంచి వచ్చిన మరో 19 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏపీలో క‌రోనా 96మంది మ‌ర‌ణించారు.

- Advertisement -