కొత్తగా 2,849 మందికి కరోనా పాజిటివ్..

140
ap corona
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని వారాలుగా కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇప్పడు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 21,672 మాత్రమే. రికవరీ రేటు అధికంగా ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.

తాజా సమాచారం ప్రకారం గడచిన 24 గంటల్లో 84,534 కరోనా టెస్టులు నిర్వహించగా, కొత్తగా 2,849 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 436, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 35 కేసులు వచ్చాయి. అదే సమయంలో 3,700 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,30,731 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,02,325 మంది ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 6,734కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై బులెటిన్ విడుదల చేసింది.

- Advertisement -