24న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..

542
kcr jagan
- Advertisement -

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్,జగన్‌లు మరోసారి భేటీ కానున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నదిజలాల వినియోగంపై పలుమార్లు భేటీ అయిన ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ నెల 24న సమావేశం కానున్నారు.

గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే అంశంతోపాటు, అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై చర్చించనున్నారు.హైదరాబాద్‌లో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎంలు కేసీఆర్,జగన్‌లతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

గతంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా, ఇంజినీర్లు రూపొందించిన ప్రతిపాదనలపై చర్చించి ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -