ఆగస్టు నుంచి ఏపీ సీఎం జగన్ పల్లెబాట

279
ap cm jagan
- Advertisement -

పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఏపీ సీఎం జగన్‌. ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది కాలంలో జగన్.. జిల్లాల పర్యటనలు చేసింది తక్కువే.

ఈ నేపథ్యంలో ప్రజలను కలుసుకునేందుకు పల్లెబాట పట్టనున్నారు ఏపీ సీఎం. ఈ కార్యక్రమంలో భాగంగా ఏడాదిలో తన పాలన గురించి తెలుసుకోవడం, సంక్షేమ పథకాలు,పాలనలో పారదర్శకత వంటి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన జగన్…ఆగస్టులో తాను పల్లెబాట చేపట్టనున్నానని తాను పర్యటించేనాటికి ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు.

పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలన్నారు. ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -