ఖజానా నిండాలని రొట్టెలు వదలండి: చంద్రబాబు

29
- Advertisement -

రాష్ట్ర ఖజానా నిండాలని ఆరు రొట్టెలు వదలాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నెల్లూరులో బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి ఇక్కడికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది అయినా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని, రాష్ట్ర ఖజానా నిండాలని ఆరు రొట్టెలు వదలాల ని భక్తులకు పిలుపునిచ్చారు.

బారా షాహీదర్గా అంటే తనకు నమ్మకమని …రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, ప్రార్ధనలు చేయడం గొప్ప పండుగ అన్నారు. ఈ పండుగ సర్వమత సమ్మేళనం… అందరం ఒక్కటేనన్నారు. కోర్కెలు కోరండి.. మళ్లీ వచ్చే ఏడాది వచ్చి మొక్కలు తీర్చుకోండన్నారు చంద్రబాబు.

Also Read:Varuj Tej: వైజాగ్‌లో వరుణ్ ‘మట్కా’

- Advertisement -