- Advertisement -
సెలబ్రెటీ కపుల్ విరాట్ కోహ్లి- అనుష్క శర్మ వింబుల్డన్ 2025లో మెరిశారు. నొవాక్ జొకోవిచ్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినార్ మధ్య జరిగిన మ్యాచ్ను విరాట్ – అనుష్క ప్రత్యక్షంగా వీక్షించారు. రాయల్ బాక్స్లో కూర్చున్న ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. అనుష్క తెల్లటి బ్లేజర్లో బాస్ లేడీ లుక్లో మెరిసిపోగా, విరాట్ గోధుమ రంగు బ్లేజర్లో హ్యాండ్సమ్గా కనిపించారు.
ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుష్క కొన్ని సార్లు ఫోన్ చూసినప్పటికీ, విరాట్ మాత్రం మ్యాచ్లో పూర్తిగా మునిగిపోయినట్టు కనిపించారు.
Also Read:‘కాంతార: చాప్టర్ 1’..రిలీజ్ డేట్
అనుష్క శర్మ 2018లో వచ్చిన జీరో (షారుక్ ఖాన్, కత్రినా కైఫ్తో కలిసి నటించిన చిత్రం) తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.
- Advertisement -

