ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్టు..!

433
ESI medicines scam
- Advertisement -

ఈఎస్‌ఐ స్కామ్‌లో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. స్కామ్‌లో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ స్కాంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితున్ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఏసీబీ సేకరించిన ఆధారాలతో ఈ స్కాంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ అరవింద్ రెడ్డి, రాం రెడ్డి, లిఖిత రెడ్డి లను ఏసీబీ అరెస్ట్ చేసింది.

ఇక మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు కేసులో నిందితులైన అధికారులతో కలిసి కుట్ర చేసిన లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ బద్దం సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని శనివారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. నకిలీ ఇండెంట్స్, బిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూ. వందల కోట్ల స్కామ్ చేశారనే ఆరోపణలతో మాజీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మతో పాటు మరో ఆరుగురు నిందితులను ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించిన విషయం తెలిసిందే.

లైఫ్ కేర్ డ్రగ్స్ అండ్ సర్జికల్స్, లైఫ్ కేర్ ఫార్మా కంపెనీల నుంచి 8 కోట్ల 25 లక్షల 25 వేల 594 రూపాయల విలువైన మందులను కొన్నట్టు వీళ్లు తప్పుడు లెక్కలు చూపించారు. మరోవైపు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న దేవికారాణి, పద్మ సహా మరో ఆరుగురిని రెండు రోజుల ఏసీబీ కస్టడీకి ఇస్తూ శనివారం కోర్టు ఆదేశాలిచ్చింది. చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైల్లో వీళ్లను ఈ నెల 9,10వ తేదీల్లో ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకోనుంది.

- Advertisement -