ద‌ళిత బంధుకు మ‌రో రూ.500 కోట్లు విడుదల..

138
Dalit Bandhu
- Advertisement -

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు గురువారం మరో 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నిధులను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సీఎం ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం ఈరోజు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సీఎం ఆదేశాలతో పూర్తి నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సీఎం ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం నిధుల విడుదల, తేదీల వివరాలు..

09.08.2021 నాడు రూ. 500 కోట్లు
23.08.2021 నాడు రూ. 500 కోట్లు
24.08.2021 నాడు రూ. 200 కోట్లు
25.08.2021 నాడు రూ. 300 కోట్లు
26.08.2021 (నేడు) రూ. 500 కోట్లు….మొత్తం రూ. 2000 కోట్లు నిధుల విడుదల చేశారు.

- Advertisement -